ఏది మంచిదైతే అదే కేంద్రం ఇస్తుంది: హరిబాబు, జగన్ జైలుకేనని పల్లె
విజయవాడ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీనా.. రాష్ట్రానికి ఏది మంచిదో అదే కేంద్రం ఇస్తుందని తెలిపారు. హోదాపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.
విశాఖ రైల్వేజోన్ ఫైల్ను కేబినెట్ అనుమతికి పంపామని తెలిపారు. విశాఖలో త్వరలో డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనను అందరూ స్వాగతిస్తున్నారని హరిబాబు అన్నారు. రికార్డు సమయంలో పట్టిసీమ పూర్తి చేయడంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. రెట్టింపు వేగంతో పోలవరంను పూర్తి చేయాల్సిన బాధ్యత బాబుదేనని ఆయన తెలిపారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్ని దీక్షలు, ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విషయం మీద కూడా అవగాహన లేదని ఆయన దుయ్యబట్టారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శుక్రవారంనాడు యుఎస్ కాన్సులేట్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు హెచ్ -1 వీసాలను పెంచాలని ఆయన కోరారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications