కోటంరెడ్డి మార్క్ దూకుడు - కొత్త రికార్డు, చంద్రబాబు ప్రశంసలు..!!
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల మధ్యనే ఉండే కోటంరెడ్డి కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు సాధించలేని అరుదైన ఘనత సాధించారు. దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఒకే రోజు ప్రారంభించారు. దీంతో, కోటంరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసిస్తూ లేఖ రాసారు. నియోజకవర్గ ప్రజల్లోనూ కోటంరెడ్డి పనుల విషయంలో దూకుడుగా ఉంటూ పూర్తి చేయటాన్ని అభినందిస్తున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా మూడో సారి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో వైసీపీలో పని చేసిన ఆయన.. 2024లో టీడీపీ నుంచి విజయం సాధించారు. కాగా,నియోజకవర్గంలో ముందస్తుగా టార్గెట్ ఫిక్స్ చేసి మరీ అనుకున్నది సాధించారు. తన నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసారు. కేవలం 60 రోజుల్లో రూ.41 కోట్లతో ఈ 339 రకాల అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. దీంతో, ఈ అరుదైన ఘనత సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ సీఎం చంద్రబాబు లేఖ పంపారు. దీనికికోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.

కాంగ్రెస్తో రాజకీయ జీవితం ప్రారంభించిన కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ప్రజలతో మమేకం అయ్యేవారు. పనులు చేయించటంలో ఆయన శైలే వేరు. వైసీపీలో ఉన్న సమయంలోనూ ప్రజా సమస్యల పైన స్పందించకపోవటంతో అధికారులను నిలదీసారు. ప్రభుత్వంలోని పెద్దలతోనూ విభేదించారు. ప్రజా సమస్యల విషయంలో దూకుడుగానే వ్యవహరించే వారు. తన నియోజకవర్గంలో ఒకే రోజులో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. అంతటితో వదల కుండా వాటిని నిరంతర పర్యవేక్షణ కోసం స్కూటీ మీద తిరుగుతూ సూచనలు చేసేవారు. తాజాగా, ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా పూర్తి చేస్తున్నారు.
జనజాతరను తలపించిన 339 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) May 15, 2025
ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తల చేత,ప్రజల సాక్షిగా జరిగిన ప్రారంభోత్సవాలు
పట్టుదలకు మారుపేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే పొట్టేపాలెం,ములుముడి బ్రిడ్జీలు మంజూరు - మంత్రి పొంగూరు నారాయణ గారు. #AdminPost #NelloreRural pic.twitter.com/XPYK6pCwwg
చంద్రబాబు లేఖలో
ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలో కోటంరెడ్డిని అభినందించారు. రూ.41 కోట్లతో నియోజక వర్గంలో 339 పనులు చేపట్టి కేవలం 60 రోజుల్లో పూర్తిచేయడం, వాటిని ప్రారంభించుకోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇచ్చినట్లుగా శంకుస్థాపన చేసి, నిర్ణీత సమయాని కి వాటిని పూర్తి చేసి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కోటంరెడ్డి పట్టుదల, చిత్తశుద్ధి అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించి నెల్లూరు రూరల్ నియోజవకర్గంలో జరుగుతున్న రూ.232 కోట్ల విలువైన పనులు కూడా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్న కోటంరెడ్డికి అభినందనలు తెలిపారు. తనకు లేఖ ద్వారా అభినందనలు తెలిపిన చంద్రబాబుకు కోటంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications