HBD Nara Lokesh:కార్యకర్తల గుండెల్లో సంక్షేమ దీపపు వెలుగు లోకేష్
వారసత్వపు వెలుగుల చాటున దాగిపోలేదు.. విమర్శల వానలో తడిసి వెనకడుగు వేయలేదు! తాను వేసిన ప్రతి అడుగు ఒక సంతకం. తగిలిన ప్రతి దెబ్బ ఒక పాఠం. అవహేళన చేసిన నోళ్లే అభినందించేలా.. తమ అంచనాలు తప్పు అని ప్రత్యర్థులు తలదించుకునేలా.. ఎదిగిన ఎవరెస్ట్ 'లోకేష్'!
జనంతో మమేకమయ్యారు.. యువగళమెత్తారు. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నారు. కష్టాలను కళ్లారా చూశారు, కన్నీళ్లు తుడిచారు. ఆ కష్టాల కడలి దాటించే వారధి తానే అయ్యారు. ఐటీ మంత్రిగా ఉద్యోగాల వేట, విద్యా మంత్రిగా సంస్కరణల బాట, ప్రజా దర్బార్ లో సామాన్యుడి ఆత్మబంధువు, కార్యకర్తల గుండెల్లో సంక్షేమ దీపపు వెలుగు! స్టాన్ఫోర్డ్ చదువు.. ప్రపంచ స్థాయి విజన్, ముఖ్యమంత్రికి తగ్గ ఆశయం.. అద్భుతమైన మిషన్. రాళ్లు వేసిన వారే పూలదండలు వేసేలా.. ఏపీని ప్రగతి పథంలో నిలిపే 'నవయుగ నాయకుడు'!

నారా లోకేష్ (Nara Lokesh) అంటే ఒకప్పుడు కేవలం "చంద్రబాబు కుమారుడు" అనే గుర్తింపు మాత్రమే ఉండేది. కానీ నేడు ఆ పేరు ఒక బ్రాండ్గా మారింది. స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి విద్యనభ్యసించి, వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, కార్పొరేట్ లగ్జరీని వదులుకుని ప్రజాసేవను ఎంచుకున్నారు. విమర్శకులు వేసిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకుంటూ, అవహేళన చేసిన నోళ్లే అభినందించేలా ఎదిగిన ఆయన ప్రయాణం 'లోకేష్ 2.0' వెర్షన్ను ప్రపంచానికి పరిచయం చేసింది.
పార్టీని పరుగులు పెట్టించిన యువగళం..
నారా లోకేష్ రాజకీయ జీవితంలో 'యువగళం' పాదయాత్ర ఒక టర్నింగ్ పాయింట్. ఎండనకా, వాననకా వేల కిలోమీటర్లు నడిచి సామాన్యుడి కష్టాలను కళ్లారా చూశారు. బాడీ షేమింగ్, ట్రోల్స్కు భయపడకుండా తన వాక్పటిమను, సహనాన్ని మెరుగుపరుచుకున్నారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన చూపిన పట్టుదల, ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ఒక పూర్తి స్థాయి పోరాట యోధుడిగా ఆయన్ని నిలబెట్టింది.
జాతీయ స్థాయి గుర్తింపు - మోదీ ప్రశంసలు..
నేడు లోకేష్ కేవలం ఏపీ నేత మాత్రమే కాదు, నేషనల్ పాలిటిక్స్లో కీలక పాత్రధారి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం లోకేష్ విజన్ను, సబ్జెక్ట్ నాలెడ్జ్ను పలుమార్లు అభినందించడం ఆయన స్థాయికి నిదర్శనం. NDA కూటమిలో టీడీపీ ప్రాధాన్యత పెంచడంలో తెరవెనుక ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ముఖ్యంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న కృషి జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది.
ఉద్యోగాల సృష్టికర్త..
గతంలో కియా, హెచ్సీఎల్ వంటి సంస్థలను ఏపీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్, ఇప్పుడు మరింత వేగంతో దూసుకుపోతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే టీసీఎస్ (TCS)ను విశాఖకు తీసుకురావడం, గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే నినాదంతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుస్తున్నారు.
విద్యాశాఖలో సంస్కరణల విప్లవం..
విద్యావంతుడైన మంత్రి విద్యాశాఖను చేపడితే మార్పు ఎలా ఉంటుందో లోకేష్ నిరూపిస్తున్నారు. మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి నిరుద్యోగుల కల సాకారం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్ క్యాలెండర్ క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థి లోకానికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. ఇది కేవలం పాలన కాదు, భవిష్యత్ తరాల నిర్మాణం.
విలువలతో కూడిన విద్య - నైతికతకు ప్రాణం..
విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు కాదని లోకేష్ బలంగా నమ్ముతున్నారు. అందుకే దేశ చరిత్రలో తొలిసారిగా పాఠ్యాంశాల్లో నైతిక విలువలు, మహనీయుల ప్రవచనాలను చేర్చారు. అంబేద్కర్, గాంధీ, వివేకానంద వంటి వారి ఆలోచనలను విద్యార్థులకు చేరువ చేయడం ద్వారా, బాధ్యతగల పౌరులను తయారు చేయాలన్న ఆయన సంకల్పం ఏపీ విద్యా విధానాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలుపుతోంది.
కార్యకర్తలే ఊపిరి - సంక్షేమ నిధికి ఆద్యుడు..
పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలకు అండగా నిలవడంలో లోకేష్ ముందుంటారు. 2015లో కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రారంభించి, వేల కుటుంబాలకు వందల కోట్ల ఆర్థిక సాయం అందించారు. ప్రమాద బీమాను రూ. 5 లక్షలకు పెంచడం, కార్యకర్తల పిల్లల చదువులకు, ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం ద్వారా "కార్యకర్తలే పార్టీ అధినేతలు" అనే నినాదానికి ఆయన నిజమైన అర్థం ఇస్తున్నారు.
ప్రజా దర్బార్..
ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు లోకేష్ ప్రారంభించిన 'ప్రజా దర్బార్' ఒక వినూత్న వేదిక. మంగళగిరి నుంచి నారా వారి పల్లె వరకు ఎక్కడ ఉన్నా సరే, గంటల తరబడి నిల్చుని వేల సంఖ్యలో వచ్చే ప్రజల అర్జీలను స్వీకరిస్తున్నారు. భూ తగాదాల నుంచి వైద్య సహాయం వరకు అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారం చూపడం ఆయనలోని మానవీయ కోణాన్ని, పాలనా దక్షతను చాటుతోంది.
రెడ్ బుక్ - కార్యకర్తల మనోగతం..
గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన కార్యకర్తలకు ధైర్యం కల్పించేందుకు 'రెడ్ బుక్' అనే ఆలోచనను తెచ్చారు. చట్టాన్ని అతిక్రమించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన చేసిన హెచ్చరిక ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించడమే కాదు, క్షేత్రస్థాయిలో కేడర్కు కొండంత అండగా నిలిచింది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, న్యాయం జరుగుతుందనే ఒక భరోసా.
భవిష్యత్ నాయకత్వం..
మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితి.. వెరసి నేటి లోకేష్. తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి, రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ, ఏపీని 'విద్యా మరియు ఐటీ ఇన్నోవేషన్ హబ్'గా మార్చే దిశగా ఆయన వేస్తున్న అడుగులు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాటలు వేస్తున్నాయి.
నిరంతర కృషితో.. నిశ్చల దీక్షతో.. ప్రజల మనిషిగా.. రేపటి ఆశగా.. ముందుకు సాగాలి ఈ లోకేష్ 2.0 ప్రస్థానం!
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications