(పిక్చర్స్) నెత్తిపై చున్నీ, ముఖంపై కర్చీఫ్: బీర్ తాగొద్దని సూచన
విశాఖ: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు యావత్ దేశాన్ని ఎండలు కకలావికలం చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత కనిపిస్తోంది. దీంతో వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయారు. బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రోజు, రేపు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఎండల్లో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉద్ధృతి మరింత పెరగనుంది.
మంగళవారం నిజామాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో పలు చోట్ల గరిష్ఠంగా 42 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో జల్లులు పడే అవకాశాలూ ఉన్నాయి.

ఎండలు
నేడు, రేపు తెలంగాణ, రాయలసీమల్లో గరిష్గ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మధ్యాహ్నం ఎండలో తిరగరాదని హెచ్చరించింది.

ఎండలు
ఎండవేడి తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ముఖానికి దస్తీ, నెత్తిన టోపీ పెట్టుకొని వెళ్తున్న ఓ ద్విచక్రవాహన చోదకుడు.

ఎండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఎండవేడికి నెత్తిన చున్ని కప్పుకొని వెళ్తున్న ఓ యువతి. ఈ ఏడాది రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే.

ఎండలు
ఎండవేడిమి తట్టుకోలేక ముఖానికి నిండుగా స్కార్ఫ్ కప్పుకొని స్కూటీ పైన వెళ్తున్న ఓ మహిళ. సాగర తీరమైన విశాఖలోను వేడికి ప్రజలు అల్లాడుతున్నారు.

ఎండలు
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లని బీరును ఆశ్రయిస్తుంటారని, అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎండలు
ఆరోగ్యానికి హాని చేయడంతోపాటు వేసవిలో బీర్లు ఎక్కువగా తాగడం వల్ల తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే ముప్పు ఉందంటున్నారు.

ఎండలు
బుధవారం, గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వడగాల్పుల ప్రభావం మరింత ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

ఎండలు
దాహం వేస్తే మంచినీళ్లు లేదంటే ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం మంచిది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇవి కాపాడతాయి.

ఎండలు
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు యావత్ దేశాన్ని ఎండలు కకలావికలం చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత కనిపిస్తోంది.

ఎండలు
దీంతో వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోయారు. బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎండలు
ఈ రోజు, రేపు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఎండల్లో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉద్ధృతి మరింత పెరగనుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications