ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు..
ఏపీలోని పలుప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీ స్థాయిలో.. కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.
వర్షాలు ఎక్కడెక్కడ పడే ఛాన్స్ ఉందంటే..?
ఈరోజు :
భారీ వర్షాలు : అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.

మంగళవారం (12-08-2025):
భారీ వర్షాలు : పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.
బుధవారం (13-08-2025):
భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు: పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల.
తేలికపాటి వర్షాలు: మిగతా జిల్లాల్లో.
ప్రజలకు సూచనలు..
పల్లె ప్రాంతాల్లో నివసించే వారు నీటి ప్రవాహానికి గురయ్యే ప్రాంతాల నుంచి తొలగించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
విద్యుత్ లైన్లు, చెట్లు విరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నడవకూడదని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications