వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఈదురుగాలులు: కుప్పకూలిన వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం, కొనసాగుతున్న దీక్ష

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం పెద్ద ఎత్తున ఈదురు గాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. అయితే ఏపీ భవన్ ప్రాంగణం లోపలే వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన తర్వాత వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ వేదికగా శుక్రవారం నాడు ఆమరణ దీక్షకు దిగారు. అయితే శుక్రవారం సాయంత్ర ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు చోటు చేసుకోవడంతో వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కూలిపోయింది. టెంట్లు లేచిపోయాయి.

heavy winds in New Delhi,destroyed ysrcp deeksha premises

దీంతో దీక్షా శిబిరం నుండి వైసీపీ ఎంపీలు లేచి ఏపీ భవన్ ప్రాంగంణం లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్ష శిబిరం వద్ద ఉన్న పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మీడియా సిబ్బంది కూడ ఈదురుగాలులతో సురక్షిత ప్రాంతాలకు చేరుకొన్నారు. తమ నిరహర దీక్షలను కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు ప్రకటించారు.

English summary
The heavy winds in New Delhi on Friday evening, this made destroy the ysrcp deeksha premises.But MPs were continued their hunger strike in Ap Bhavan premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X