బెజవాడ అమ్మవారికి హెటిరో భారీ కానుకలు!
విజయవాడ: దసరా ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో విజయవాడలో కొలువైన కనకదుర్గ అమ్మవారికి కానుకలు సమర్పించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆసక్తిచూపుతున్నారు. హెటిరో గ్రూపు తరఫున బండి పార్థసారథిరెడ్డి అమ్మవారికి భారీ కానుక సమర్పించేందుకు ముందుకు వచ్చారు.
ఇందుకోసం ాయన నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. బెజవాడ అమ్మవారికి స్వర్ణకవచం, కిరీటం, బంగారు చేతులు, ముక్కుపుడకను ఆయన తయారు చేయిస్తున్నారు.
మరోవైపు ఆర్వీఆర్ అసోసియేట్స్ కనకదుర్గమ్మ ఆలయానికి బంగారు వాకిలిని చేయిస్తోంది. దీని కోసం సదరు సంస్థ కోటి రూపాయలు ఖర్చు చేస్తోందని ఆలయ అధికారులు మీడియాకు తెలిపారు.

రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి ఓ ఎన్ఆర్ఐ కుటుంబం అమ్మవారికి వజ్రాల నెక్లెస్ తయారు చేయిస్తోందని చెప్పారు. దసరా సందర్భంగా 11 రోజులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి.
ఈ సమయంలో కనకదుర్గమ్మను ఈ ఆభరణాలతో అలంకరించుతారు. మరోవైపు, డాక్టర్ అర్చన అనే మహిళ 11 రోజులు కనకదుర్గమ్మ అలంకారాల కోసం 11 పట్టు చీరలను చెన్నైలో చేయిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications