ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ: బాబు ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్

హైదరాబాద్: మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర నేతలపై పెట్టిన కేసులను ఎందుకు ఉపహసంహరించారని హైకోర్టు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార పార్టీ టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై ఉన్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకుంటూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసన విషయం తెలిసిందే.

ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ పిల్‌నును విచారించింది. ఇదే కేసులో వైకాపా ఎమ్మెల్యే కూడా పిటిషన్ దాఖలు చేశారు.

High Court asks the reasons to withdrawl of cases against MLAs

ఈ రెండింటిని కలిసి రిజిస్ట్రీలో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై ఆంధ్రప్రభుత్వం ఉపసంహరిస్తూ జారీ చేసిన 13 జీవోలను పిల్‌లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సవాలు చేసింది. ఈ కేసులను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషన్‌లో అన్నారు.

దర్యాప్తు ప్రాతిపదికన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఒక్కటే కేసులను ఉపసంహరించుకునే హక్కు ఉంటుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నది. కాగా హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నంత వరకు దిగువ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు వాయిదాలు కోరుతారని, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+