చంద్రబాబు తల తెగ నరుకుతామన్న వైసీపీ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తల తెగ నరుకుతామన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హైకోర్టు బెయిల్ మంజారు చేసింది. విశాఖ జిల్లా చింతపల్లిలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల తెగ నరుకుతామని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. అనంతరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి, పాడేరు, అరకు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

విశాఖ జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో 124(ఎ) 307, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. శుక్రవారం ఆమెకు బెయిల్ మంజారు చేయడంతో శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు.
More From
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications