షరతులతో హైద్రాబాద్లో జగన్ సమైక్యసభకు గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఈ నెల 19న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం పచ్చజెండా ఊపింది. న్యాయస్థానం షరతులతో కూడిన సభకు అనుమతిని ఇచ్చింది.
మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సభను నిర్వహించుకోవాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించింది. తాము ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని పోలీసులకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇలా పదకొండు షరతులతో సమైక్య శంఖారావ సభకు ఉన్నత న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది.

కాగా, సమైక్య శంఖారావం పేరుతో ఈ నెల 19న హైదరాబాదులో సభ నిర్వహించుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి ఇటీవల దరఖాస్తు చేసుకుంది. దానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై జగన్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సభ విషయం పోలీసులు తేల్చాల్సిన అంశమని కోర్టు సూచించింది.
పోలీసులు సమైక్య శంఖారావ సభకు అనుమతిని నిరాకరించారు. దీంతో జగన్ పార్టీ మరోసారి హైకోర్టుకు వెళ్లారు. తమ వాదన వినిపించుకునే హక్కు తమకు ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అనంతరం హైకోర్టు షరతులతో సభకు అనుమతి ఇచ్చింది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications