ట్రిపుల్ మర్డర్: పోలీసుల అదుపులో సిఐ, కానిస్టేబుళ్లు
హంతకులకు సహకరించడంతోపాటు హతులకు సరైన రక్షణ కల్పించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. సీఐ దురుద్దేశంతో వ్యవహరించారని దర్యాప్తులో తేలడంతో సిఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైన సమాచారం అందించడం లేదు.
గత నెల 24వ తేదీన కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి జాతీయ రహదారిపై గంధం నాగేశ్వర రావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, మారయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కోసులో మారం శ్రీనివాస్, గణేష్ సహా స్థానికులు ఆరుగురు నిందితులుగా ఉన్నారు.
ఈ క్రమంలో వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు వీలైనంత త్వరగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోతారని, అప్పటి వరకు వారిని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టవద్దని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.