ఫేస్బుక్ పరిచయం: కూతుర్ని ప్రేమించాడని చంపేసిన తండ్రి
తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
రాజమహేంద్రవరం: తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని ఆమె తండ్రి ఓ యువకుడ్ని చంపేసి, గోతిలో పాతి పెట్టారు.
ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడయింది. కొద్ది రోజులుగా మృతుడు రామాంజనేయులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు కోణాల్లో విచారించి, యువతి తండ్రే చంపేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.

నిందితుడిని విజయ్ కుమార్గా గుర్తించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ కుమార్ కూతురు, మరో పక్క గ్రామానికి చెందిన యువకుడు రామాంజనేయులుకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని చెబుతున్నారు.
ఈ విషయం విజయ్ కుమార్కు తెలిసింది. దీంతో అతను రామాజనేయులును హత్య చేసి కరవాడ బీచ్లో పాతిపెట్టాడని తెలుస్తోంది. అయితే, అమ్మాయి, మృతుడు.. ఇరువురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
మరోవైపు, నిందితుడు విజయ్ కుమార్ గ్రామానికి చెందిన కొందరు మరో వాదన వినిపిస్తున్నారు. రామాంజనేయులు, యువతి మధ్య ప్రేమ లేదని, అతను నిత్యం వేధించేవాడని చెబుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications