అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతుర్నే చంపారు: డిగ్రీ విద్యార్థిని హత్య

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాలో జరిగిన పరువు హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంగా తల్లిదండ్రులే ఆ యువతిని దారుణంగా హత్య చేశారు. చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిచింది.

తమ కూతురు వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ పరువు పోతుందని భావించిన ఆ తల్లిదండ్రులు కన్న కూతురని కూడా చూడకుండా ఉరివేసి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టి తల్లిదండ్రులే హత్య చేసినట్లు తేల్చారు. పోలీసులు సుశీల తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారు. కూతురు హత్యను కిడ్నాప్‌గా చిత్రీకరించేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

Honour Killing: a girl allegedly murdered by her parents

డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థినిన హత్య చేసిన దుండగులు రైలు పట్టాలపై పడేశారు. విషయం తెలుసుకున్న మృతురాలు కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్

ప్రకాశం జిల్లాలోని కారంచేడు మండలం దగ్గుబాడులో ఓ స్కూల్ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవవాత్తు ఆ కాలువలో ఎక్కువగా నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థిలకు ఎలాంటి గాయాలు కాలేదు.

English summary
A girl allegedly murdered by her parents in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X