Sabarimala News:శబరిమల వెళ్లే వారికి వసతి పై దేవస్థానం కీలక ప్రకటన..!!
శబరిమల లో భక్తుల రద్దీ పెరుగుతోంది. మండల - మకరవిళక్కు సీజన్లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో దర్శనం వేళ పోలీసులు ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇక, శబరిమలలో బస కోసం భక్తులకు గదుల బుకింగ్ పై దేవస్థానం కీలక ప్రకటన చేసింది.
నవంబర్ 16న ఆలయం తెరుచుకోగా, ఈ తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. గతేడాది ఇదే సమయంలో రూ.28.3 కోట్లు ఆదాయం రాగా.. ఈ సారి అది రూ.41.64 కోట్లకు పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందుగానే బసకు వీలుగా ఆన్ లైన్ లో గదులను బుక్ చేసుకునే అవకాశం దేవస్థానం కల్పించింది. ఇందు కోసం కీలక సూచనలు చేసింది.

శబరిమల గదిని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇందు కోసం www.onlinetdb.com ని సందర్శించాలని ఆలయ అధికారులు స్పష్టం చేసారు. మొదటిసారి టికెట్ బుక్ చేసుకునేవారు సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇచ్చిన తరువాత అప్లికేషన్ ఫారమ్ కనిపిస్తుందిని చెప్పారు. అక్కడ శబరిమలలో గదులు అందుబాటులో ఉన్నాయో లేదా సెర్చ్ చేయటం ద్వారా కావాల్సిన డేట్స్ లో భక్తుడి వివరాలు నమోదు చేసుకోవాలని. నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం తో గదులను ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకోవచ్చని దేవస్థానం వెల్లడించింది.
గదిని బుక్ చేసే సమయంలో తగిన చెక్-ఇన్ స్లాట్ రూమ్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇక, గది బుకింగ్ సమయంలో అందించిన ఫొటో, ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. గదిలో ఎంత మంది ఉంటారన్నది బుకింగ్ సమయంలోనే పేర్కొనాలి. అలా కాకుండా.. ఎక్కువ మంది వెళ్తే.. ప్రతి అదనపు వ్యక్తికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. ఈ విధానం అనుసరించటం ద్వారా భక్తులకు బస గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా ఆలయానికి వచ్చిన ప్రతీ భక్తుడు దర్శనం చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications