భార్యతో సంబంధం అనుమానం: ఫ్రెండ్ను చంపిన భర్త
యువకుడు హత్య
రెయిన్ బజార్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ నెల 9వ తేదీన అతను అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని నలుగురు స్నేహితులు కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అతని మృతదేహం డ్రయినేజీలో గుర్తించారు.
ప్రియుడి తల్లి మృతి
హైదరాబాదులోని వనస్థలిపురంలో ఓ ప్రేమజంట వ్యవహారం ఘర్షణకు దారి తీసింది. ప్రియుడు, అతని తల్లి పైన ప్రియురాలి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రియుడి తల్లి గాయపడింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. యువతి బంధువులు విచక్షణా రహితంగా కొట్టడం వల్లనే తన తల్లి మృతి చెందిందని ప్రియుడు ఆరోపిస్తున్నారు.
గుల్బర్గా ఎస్సై మృతి
గుల్బర్గా ఎస్సై మల్లికార్జున హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ నెల 8న గుల్బర్గాలో రౌడీ షీటర్ మున్నాతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఎస్సై తలలోకి రెండు బుల్లెట్లు దూసుకు పోయాయి. దీంతో ఎస్సైని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఎస్సై కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు.