కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికపై కిరోసిన్ పోసిన మరో బాలిక, స్త్రీని దొంగలు హత్య చేసి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఓ భర్త అనుమానంతో భార్యను హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మమత, మల్లేశంలు భార్యాభర్తలు. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. కొద్ది రోజులుగా భార్య పైన భర్త అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఆమె పైన కత్తితో దాడి చేసి, హతమార్చాడు. నిందితుడు పరారయ్యాడు. కాగా, భార్యను అదనపు కట్నం కోసం వేధించే వాడని మహిళ బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

బాలికపై కిరోసిన్‌పోసిన నిప్పంటించిన మరో బాలిక

Husband kills wife in Karimnagar

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ మండలం భూరుగడ్డలో దారుణం జరిగింది. ఓ ఆట ఓ బాలిక ప్రాణం మీదకు తెచ్చింది. తొండి చేసి గెలిచావంటూ ఆగ్రహంతో ఓ బాలిక మరో బాలికపై కిరోసిన్‌పోసి నిప్పటించింది. మంటలు తాళలేక బాలిక కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దొంగల బీభత్సం, మహిళ హత్య

సామర్లకోటలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ మహిళను హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అఫహరించారు. ఆమె ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి వచ్చి, ఆమెను హత్య చేసి దొంగతనం చేశారు. గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి, టీవీ సౌండును ఎక్కువ చేసి ఇంటికి తాళాలు వేసి వారు పరారయ్యారు.

English summary
Husband kills wife in Karimnagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X