4జి, వైఫై నగరంగా హైదరాబాద్: కెసిఆర్, 6నెలల్లోగా..
హైదరాబాద్: నగరాన్ని 4జి, వైఫై నగరంగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐటి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ ఆఖరులోగా హైదరాబాద్లో 4జి, వైఫై సేవలు అందుబాటులోకి తేవాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు. 4జి, వైఫై సేవలను దశల వారీగా విస్తరించాలని అన్నారు. తొలి దశలో 6 కార్పొరేట్లు, 37 మున్సిపాల్టీల్లో ఈ సేవలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

మొదటి ఆరు నెలలు వైఫై సేవలను ఉచితంగా అందించనున్నట్లు కెసిఆర్ తెలిపారు. వైఫై సేవల కోసం రూ. 4,100 కోట్లు ఖర్చుక చేయనున్నట్లు కెసిఆర్ తెలిపారు.
ప్రజల ఆలోచనలనే తెలంగాణ ప్రభుత్వం చట్టాలుగా చేస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 43 పథకాలను అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications