మాకు సంబంధం లేదు, తెలంగాణదే: అరెస్ట్లపై బాబు, జగన్పై ఆగ్రహం
హైదరాబాదులో శాంతిభద్రత సమస్య తమ ప్రభుత్వానిది కాదని, తెలంగాణ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శాసన సభలో అన్నారు. చలో హైదరాబాద్ పేరిట అంగన్వాడీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. దీని పైన ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. హైదరాబాదులో అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకున్నది ఏపీ ప్రభుత్వం పోలీసులు కాదని చెప్పారు. హైదరాబాదు శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్రం చేతుల్లో ఉన్నాయని చెప్పారు.
అంగన్వాడీలు ఆందోళన విరమించాలని చెప్పారు. వారిని అరెస్టులు తమ ప్రభుత్వం నిర్ణయం కాదని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వకుండా అంగన్వాడీలు తక్షణమే ఆందోళన విరమించాలన్నారు.

కాగా, అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు మండిపడ్డ విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత అగ్లీసీన్ సృష్టిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. అవినీతి పత్రిక ఉందని అడ్డగోలుగా వార్తలు రాయవద్దన్నారు. సాక్షి పత్రిక పోలవరం ప్రాజెక్టు పైన రాసిన కథనం పైన అధికార పార్టీ నిప్పులు చెరిగింది.
సభలో గందరగోళం చెలరేగటంతో సభ వాయిదా పడింది. అనంతరం ఒకటిన్నరకు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాయలసీమ కల్చర్ శాసన సభలో ప్రవేశ పెట్టాలనుకోవడం విడ్డూరమని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు ముప్పయ్యేళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేదన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో సభ తిరిగి రేపటికి వాయిదా పడింది.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
తమిళ సాంగ్లో ఎనర్జిటిక్ డ్యాన్స్తో అదరగొట్టిన రోజా! వీడియో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications