విశాఖ గీతం వర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం: నగరంలోని రుషికొండ ప్రాంతంలో ఉన్న గీతం యూనివర్సిటీలోని హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్ధిని శ్రేయ ప్రసాద్ (19) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన శ్రేయ ప్రసాద్ గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ హాస్టల్లోనే ఉంటోంది. శుక్రవారం తరగతులకు వెళ్లిన ఆమె మధ్యాహ్నాం హాస్టల్లోని తన తరగతి గదికి వచ్చేసింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుకుంటూ కన్నీరుపెట్టింది.

ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల మధ్య తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో స్నేహితులు గదిలోకి రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్య సమాచారాన్ని కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications