ప్రతిపక్ష పార్టీలు చేతులు కాలక ఆకులు పట్టుకున్నాయి: కేఏ పాల్
ఈవీఎంలలో అవకతవకలపై తాను గతంలో పోరాటానికి పిలుపునిచ్చానని, అయితే అప్పుడు చంద్రబాబుతో పాటు మమతా, అఖిలేష్ యాదవ్ మాయవతిలు ఎవరు కూడ పట్టించుకోలేదని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ . కాగా గతంలోనే ఎన్నికల ఎన్నికల నిర్వహాణలో లోపాలు ఉన్నాయని అందుకే అప్పుడే ఎన్నికలను బహిష్కరించాలని కోరానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సిస్టంపై పోరాడుతున్న నాయకులు ఎవరు కలిసి రాలేదని అన్నారు.
కాగా అమేరికా లాంటీ దేశాల్లో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారనే ఎన్నికలు జరగుతాయని కేఏ పాల్ గుర్తు చేశారు.ఈనేఫథ్యంలోనే దేశంలో కనీసం ఎన్నికలను కూడ సరిగా నిర్వహించుకోకపోవడం సిగ్గు చేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుడు తన మాట వినని చంద్రబాబు లాంటీ నాయకులు వారి వరకు వచ్చే వరకు పోరాటం చేస్తున్నారని అన్నారు.దీంతో వారు ఎన్నికల నిర్వహాణ విషయంలో చేతులు కాలక ఆకులు పట్టుకున్నారని అన్నారు.
ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావని బీజేపీ 200 సీట్లు దాటవని జోస్యం చెప్పారు.ఇక కేంద్రంలో మమత బెనర్జీ తోపాటు అఖిలేశ్ యాదవ్ ,మాయవతి లాంటీ నేతలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications