వస్తా.. ఇప్పుడు కాదు!: రాజకీయాల వైపు అశోక్ చూపు
రాజకీయ నాయకులు సమైక్యాంధ్రను మరిచి స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నారని మండిపడ్డారు. తాను అవసరమైనప్పుడు రాజకీయాలలోకి వచ్చి అలాంటి వారికి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అనంతరం శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూడా అవే వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలపై నమ్మకం పోయిందని, ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు మోసం చేసినందుకే ఉద్యోగులు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లో సభ నిర్వహించనున్నట్లు అశోక్ బాబు వెల్లడించారు.
సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. తన వెనుక ఏడు కోట్ల మంది జనం ఉన్నారని, రాజకీయాల్లోకి ఇప్పుడు రానని, ప్రజల నుండి పలుమార్లు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానం వచ్చిందని, ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని భవిష్యత్తులో ప్రజాభీష్టం మేరకు ఆలోచిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగిగా ఉంటానన్నారు.