వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వస్తా.. ఇప్పుడు కాదు!: రాజకీయాల వైపు అశోక్ చూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ashok Babu
విజయవాడ: సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్న ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రాజకీయాల వైపు చూస్తున్నారు! శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

రాజకీయ నాయకులు సమైక్యాంధ్రను మరిచి స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నారని మండిపడ్డారు. తాను అవసరమైనప్పుడు రాజకీయాలలోకి వచ్చి అలాంటి వారికి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అనంతరం శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూడా అవే వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలపై నమ్మకం పోయిందని, ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు మోసం చేసినందుకే ఉద్యోగులు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు అశోక్ బాబు వెల్లడించారు.

సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. తన వెనుక ఏడు కోట్ల మంది జనం ఉన్నారని, రాజకీయాల్లోకి ఇప్పుడు రానని, ప్రజల నుండి పలుమార్లు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానం వచ్చిందని, ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని భవిష్యత్తులో ప్రజాభీష్టం మేరకు ఆలోచిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగిగా ఉంటానన్నారు.

English summary
APNGos chief Ashok Babu on Friday said he may have to enter politics to teach a lesson to opportinistic politicians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X