దశాబ్దాలు: మురళీమోహన్, 'సినిమా' కుదరదని షాక్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతం తెలంగాణ రాజధాని హైదరాబాదులా అభివృద్ధి చెందేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రముఖ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్ శుక్రవారం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఏపీ కొత్త రాజధానిగా విజయవాడను ప్రకటించడం సంతోషదాయకమన్నారు. రాజధాని ప్రకటనను ఏకగ్రీవంగా అంగీకరించడం శుభపరిణామం అన్నారు. ప్రతి ఒక్కరూ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.
హైదరాబాదులా అభివృద్ధి సాధించేందుకు దశాబ్దాలు పడుతుందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుండి తరలించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి యాభై ఏళ్లు పట్టిందన్నారు.

ఇప్పటికిప్పుడు విశాఖ గానీ, రాజమండ్రి గాని వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, విశాఖను చిత్రపరిశ్రమకు కేంద్రంగా చేస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. మురళీ మోహన్ మాత్రం తరలించడం ఇప్పటిక్పుపుడు సాధ్యం కాదని చెప్పడం గమనార్హం.
కేంద్రం స్వాగతిస్తుంది: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటనను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. విభజన చట్టానికి లోబడి కొత్త రాజధానికి సహకారం అందిస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్షను కేంద్రం చూపబోదన్నారు.
ఏపీ, తెలంగాణల్లో తనిఖీలు పెంచండి: గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తనిఖీలు, నిఘా పెంచాలని గవర్నర్ నరసింహన్ అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల అంశంపై నరసింహన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల డీజీపీలు, సలహాదారులు పాల్గొన్నారు. భారత్లో ఆల్ ఖైదా ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications