వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

buddha venkanna: బాబాయ్‌నే చంపేశారు.. మేమే లెక్కనా, ప్రజల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. సొంత చిన్నాననే చంపేశారు.. మేమే లెక్క అంటూ హాట్ ట్వీట్ చేశారు. నిన్న మాచర్ల వెళ్లిన బుద్దా వెంకన్న, బోండా ఉమా కారుపై కొందరు దాడిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుద్దా వెంకన్న చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది.

స్వార్థ రాజకీయాల కోస సొంత బాబాయ్ అని కూడా చూడని వారు.. సాధారణ బీసీ నేతను తనను వదలుతారని అనుకోవడం లేదన్నారు. కానీ తాను మాత్రం గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ చంద్రబాబు నాయుడు వెంటే ఉంటానని స్పష్టంచేశారు. ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు తలొగ్గే పరిస్థితి లేదని స్పష్టంచేశారు.

i will die for people tdp mlc buddha venkanna

ఏదీ ఏమైనా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. తనను అధికార పార్టీ నేతలు వదలబోరని, కానీ తాను వారికి భయపడబోనని తేల్చిచెప్పారు. చంద్రబాబు వెంట ఉండి.. ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసేందుకైనా సిద్దమని తేల్చిచెప్పారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ నేర్పిన విలువలు, విధానాలకు కట్టుబడి పనిచేస్తానని బుద్దావెంకన్న స్పష్టంచేశారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని.. దానిపై తన పోరాటం కొనసాగుతోందని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

స్థానిక సంస్థల నామినేషన్ చివరిరోజు బుధవారం టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు మాచర్ల వెళ్లారు. వారు 10 కార్లతో రావడంతో వృద్ధులు, పిల్లలు హడలెత్తిపోయారని.. కొందరు కారుపై దాడిచేసిన సంగతి తెలిసిందే. విపక్ష టీడీపీ దాడికి సంబంధించిన వీడియోను కూడా మీడియాకు విడుదల చేసింది. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. దాడి చేసిన తురక కిశోర్, నాగరాజు, గోపిను అరెస్ట్ చేశారు.

English summary
i will die for andhra pradesh people tdp mlc buddha venkanna said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X