నా రక్తం ఇస్తా.. గర్భిణికి ఆపరేషన్ చేయండి:ఎమ్మెల్యే
బాపట్ల: గణపపరానికి చెందిన గర్భిణి అన్నామణి మంగళవారం బాపట్ల ఆసుపత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి తన బిడ్డను కాపాడాలని కోరింది. బాపట్ల ఆసుపత్రిలో బీ పాజిటివ్ రక్తం లేకపోవడంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు.
అదే సమయంలో ఆసుపత్రిలో అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన బాపట్ల వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘపతికి తన గోడును వెళ్లబోసుకుంది. ‘సార్.. నాకు ఆపరేషన్ చేయరంట.. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు' అంటూ నిండు గర్భిణి అన్నామణి ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట బోరున విలపించింది.

దీంతో స్పందించిన ఆయన ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి' అని చెప్పారని తెలుస్తోంది. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్ బ్యాంకు నుంచి అదే గ్రూపు రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టి. రామారెడ్డకి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు రాంబాబు బుధవారం రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలు జారిపడి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications