తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలోనే టిటిడి బోర్డు పాలకవర్గం నియామకం: చంద్రబాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరుపతి: త్వరలోనే టిటిడి పాలకమండలిని నియమించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదివారం నాడు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని సందర్శించుకొన్నారు.

పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు,చిరంజీవి అందుకే దెబ్బతిన్నారు: చింతా మోహన్ సంచలనంపవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు,చిరంజీవి అందుకే దెబ్బతిన్నారు: చింతా మోహన్ సంచలనం

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబునాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు శనివారం రాత్రి చేరుకొన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబునాయుడు జరుపుకోనున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడు కూడ నారావారిపల్లెకు చేరుకొన్నారు.

I will nominate TTD board soon, says Chandrababu naidu

టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన: ట్రంప్ ఆహ్వనం, ఎందుకంటే?టెక్కీ కూచిబొట్ల శ్రీనివాస్ భార్య సునయన: ట్రంప్ ఆహ్వనం, ఎందుకంటే?

ఆదివారం ఉదయం బోగిమంటలు వేసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు తదితరులు తిరుమలకు వచ్చారు.

తిరుమలకు వచ్చిన సీఎం బంధుమిత్రులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనాలు పలికారు.త్వరలోనే టిటిడి పాలకమండలి నియమిస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించినట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

English summary
Ap chief minister Chandrababu naidu said that I will nominate TTD board soon.Ap chief minister Chandra Babu who came to Tirupati with family members on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X