రిజైన్ చేయనని కనుమూరి: బీజేపీ ఒత్తిడి, బాబుకి చిక్కు
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చాలా పవిత్రమైనదని, తనకు తానుగా నేను రాజీనామా చేయనని కనుమూరి బాపిరాజు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పదవి చాలా పవిత్రమైనదన్నారు. నేను రాజీనామా చేయనని తెలిపారు. నూతన పాలక మండలి ఏర్పడే వరకు కొనసాగుతానని తెలిపారు. ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు.
బీజేపీ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి
టీడీపీ ప్రభుత్వం కమిటీలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నందున కనుమూరి త్వరలో రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆయన రాజీనామా చేసేది లేదని చెప్పారు. అయితే, దీని వెనుక లాబీయింగ్ నడుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ పార్లమెంటు సభ్యుడు గోకరాజు రంగరాజుకు కనుమూరి బాపిరాజు బంధువు. ఈ నేపథ్యంలో గోకరాజు ద్వారా కనుమూరి పదవిని కాపాడుకునేందుకు లాబాయింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ పైన ఒత్తిడి తెస్తుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుండి గోకరాజుకు చివరి నిమిషంలో టిక్కెట్ వచ్చింది.
ఇప్పుడు కనుమూరి విషయంలోను బీజేపీ ద్వారా ఆయన తన పట్టు సాధించుకోవచ్చునని అంటున్నారు. బీజేపీ ద్వారా లాబీయింగ్ జరుపుతుండటంతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చాలామంది రేసులో ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కనుమూరికే అవకాశం వస్తే అది చంద్రబాబుకు ఇబ్బందే అంటున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications