ప్రొఫెసర్ సూసైడ్: భార్య నుండి తీసుకెళ్లిన పిల్లలు మిస్

భార్య సుహాసినికి కొంతకాలం కిందట విడాకులు ఇచ్చి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. వారికి విఠల్ (9), నంద విహారి (5) అనే ఇద్దరు పిల్లలు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న నేపథ్యంలో నెలలో ఒకటిన్నర రోజులు తండ్రి వద్ద ఉండాలని కోర్టు షరతు విధించింది.
ఈ మేరకు శనివారం ఉదయం భార్య నివాసం ఉండే ఆనంద్బాగ్ నుంచి పిల్లలిద్దరినీ తనతో తీసుకెళ్లిన గురు ప్రసాద్ రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పిల్లల ఆచూకీ లభించకపోవటంతో భార్య తరపు వారిలో ఆందోళన నెలకొంది. మల్కాజిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అల్వాల్ నివాసి అయిన రాఘవేంద్ర గురు ప్రసాద్, ఆనంద్బాగ్, మల్కాజిగిరి నివాసి సుహాసిని(38)తో దాదాపు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. విఠల్ (9), నందవిహరి (5). భార్యాభర్తల మధ్య వరకట్న సమస్య తలెత్తటంతో భార్య భర్తపై కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది.
కోర్టులో వీరికి 2013లో విడాకులు మంజూరు అయ్యాయి. మొదటి శనివారం, మొదటి ఆదివారం, మూడో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భర్త వద్ద పిల్లలు ఉండాలని కోర్టు సూచించింది. దీని ప్రకారంగానే ఈ నెల నాలుగున శనివారం ఉదయం పిల్లలను ఆనంద్బాగ్ నుంచి తీసుకెళ్లిన గురు ప్రసాద్ మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు తీసుకురాలేదు.
దీంతో సాయంత్రం వరకు ఎదురు చూసిన సుహాసినిలో ఆందోళన మొదలయింది. ఆ తర్వాత రాఘవేంద్ర గురు ప్రసాద్ సికింద్రాబాద్లోని జేమ్స్ స్ట్రీట్ వద్ద పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం రావటంతో సుహాసిని బంధువులు పిల్లల ఆచూకీ కోసం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications