పేదలకు కార్పొరేట్ వైద్యం : యూనివర్సల్ హెల్త్ కార్డు పేరుతో జగన్ బ్రహ్మస్త్రం
గుంటూరు : ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకోవడంతో .. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు హామీల జల్లు కురిపిస్తున్నాయి. ఆయా వర్గాలను ఇంప్రెస్ చేసి, ఓటు బ్యాంకుగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ గుంటూరు సభలో ఆశేషజనవాహిని మధ్య జగన్ పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని హామీనిచ్చారు.
యూనివర్సల్ హెల్త్ కార్డు
వైసీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు జగన్. వైసీపీ అధికారం చేపట్టాక ఆరోగ్యశ్రీ పరిధిలోకి యూనివర్షల్ హెల్త్ కార్డు తీసుకొస్తానని జగన్ హామీనిచ్చారు. ప్రతి పేదవారి నుంచి నెలకు రూ.40 వేలు సంపాదించే వారు ఈ పథకం పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఏడాదికి 5 లక్షలు సంపాదించేవారు యూనివర్సల్ హెల్త్ కార్డు వర్తిస్తోందని స్పష్టంచేశారు.
వెయ్యిదాటితే వర్తింపు ..
పెద్ద వ్యాధులే కాదు ఆస్పత్రిలో చేరి బిల్లు రూ.వెయ్యి దాటితే కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు వర్తిస్తోందని జగన్ స్పష్టంచేశారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలవారికి మేలు జరుగుతోందని పేర్కొన్నారు.
స్వయంగా పర్యవేక్షిస్తా ..
దేవుడి ఆశీర్వదించి, మీరు కనికరిస్తే సీఎం పదవీ చేపడుతానని జగన్ స్పష్టంచేశారు. ప్రతిష్టాత్మక యూనివర్సల్ హెల్త్ కార్డు పథకాన్ని స్వయంగా నేనే పర్యవేక్షిస్తానని భరోసా కల్పించారు జగన్. అధికారం చేపట్టిన వెంటనే ఈ పథకం అమల్లోకి వస్తుందని ... పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని స్పష్టంచేశారాయన.