అలా చేస్తే ప్రతిపక్షంలో కూర్చుంటారు : జగన్ కు నారాయణ హితవు
ఏపీ సీఎం జగన్ కు సిపిఐ నేత నారాయణ సున్నితంగా చురకలు అంటించారు . గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది కక్ష సాధింపు అన్నారని, నేడు జగన్ చేస్తున్నది అదే పాలన అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సర్కార్ పాలనపై విమర్శలు గుప్పించారు . జగన్ పాలన బాగుంటుందని తాను అనుకొన్నానని పేర్కొన్న నారాయణ .చంద్రబాబుపై ఉన్న కక్షతో జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.
జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. క్యాపిటల్ గా అమరావతికే సీపీఐ కట్టుబడి ఉందన్నారు నారాయణ. జీఎన్రావు కమిటీకి విలువ లేదని నారయణ అభిప్రాయపడ్డారు. ఇక జగన్ అనాలోచిత నిర్ణయాలు ఆయనకు భవిష్యత్ లో ఇబ్బంది కలిగిస్తాయని అన్నారు.ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పార్టీ ప్రచారం వద్దని నారాయణ అన్నారు. ఇక అధికారులపై కక్ష సాధింపు చర్యలను ప్రస్తావిస్తూ ఐఆర్ఎస్ అధికారి కృష్ణ ప్రసాద్పై కక్ష సరికాదని పేర్కొన్నారు.

ఏ ప్రభుత్వం ఉంటే వారి ఆలోచనలతోనే అధికారులు పనిచేస్తారని ఆయన చెప్పారు. అంత మాత్రాన వారిపై వేధింపులకు దిగటం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు టీడీపీని తొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం జైలులో ఉన్న వ్యక్తికి సీఎస్ పదవిని కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలాగా పాలన చేస్తామంటే భవిష్యత్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సివస్తుందని నారాయణ హెచ్చరించారు.ఇప్పటికైనా జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో అలోచించి తీసుకోవాలని నారాయణ హితవు పలికారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications