వివాహేతర సంబంధానికి ఇద్దరు బలి: విశాఖలో దారుణం..
ఘటనలో ఓ మహిళ, పురుషుడు ఇద్దరు దారుణంగా హత్య చేయబడ్డారు. వివాహేతర సంబంధమే వీరిద్దరి హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు.
విశాఖపట్నం: వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది.
ఘటనలో ఓ మహిళ, పురుషుడు ఇద్దరు దారుణంగా హత్య చేయబడ్డారు. వివాహేతర సంబంధమే వీరిద్దరి హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. హత్య సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications