పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయింది. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తాజా హెచ్చరిక జారీ చేసారు. దీంతో.. రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లోని రైతాంగం అలర్ట్ గా ఉండాలని సూచించారు. కోస్తాతో పాటుగా రాయలసీమ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగుపాటు పైన ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిక చేసింది. అల్లూరి, పోల వరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎల్లో అలర్ట్ జారీ చేసిన విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణ అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని.. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని సూచన చేసారు.

వాతావరణ శాఖ కీలక సూచనలు
ఒక్క సారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. ఒకవైపు ఉపరితల ఆవర్తనం, మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, రాయలసీమ లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్ తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం మూడు రకాల వాతావరణ పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం ఈరోజు కొంత తగ్గింది. దీంతో, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వడగళ్లు- పిడుగులు, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
ఆ అదృష్టం - బాధ్యత నాదే, ఉగాది వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?













Click it and Unblock the Notifications