ఏపీలో వైసీపీదే అధికారం : పీకే టీంను అభినందించనున్న జగన్
హైదరాబాద్ : ఏపీలో వైసీపీ ఎన్నికల కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్తో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఐపాక్ కార్యాలయంలో వీరి భేటీ జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీలో పోలింగ్ సరళి, సర్వే వివరాలపై ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ కోసం అహోరాత్రులు శ్రమించిన ప్రశాంత్ కిశోర్ బృందాన్ని జగన్ అభినందనలు తెలుపనున్నారు.

పీకే టీంకు అభినందనలు
ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పీకే టీం పనిచేస్తోంది. అలాగే ప్రశాంత్ సూచనలను జగన్ పాటించారు. పీకే టీం కూడా ఎన్నికలకు ముందు నియోజకవర్గాలవారీగా ప్రచాం చేపట్టింది. పీకే సూచనలతో జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని తెలుస్తోంది. తమకు ఓటమి తప్పదని తెలిసిన చంద్రబాబు .. నకిలీ సర్వే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారని చెప్పారు ప్రశాంత్ కిశోర్. ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. దీంతోపాటు జగన్తో తనకు విభేదాలు వచ్చాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఇప్పటికే చంద్రబాబు బైబై చెప్పేశారని పేర్కొన్నారు పీకే.












Click it and Unblock the Notifications