ఇంటర్ సెకండియర్: అమ్మాయిలదే హవా, కృష్ణా ఫస్ట్
హైదరాబాద్: ఇంటర్ సెకండియర్ ఫలితాలను శనివారం మధ్యాహ్నం గం.11.30లకు విడుదల చేశారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 65.57గా ఉంది. బాలికలదే పైచేయిగా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 69.52గా ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 61.87గా ఉంది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 82 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, 49 శాతంతో అదిలాబాద్, మెదక్ జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం పెరిగింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలు 67.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 61.87 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం గవర్నర్ సలహాదారుడు సలావుద్దీన్ అహ్మద్ ఫలితాలను విడుదల చేశారు.
కృష్ణా జిల్లాలో 82 శాతం, విశాఖపట్నం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో 76 శాతం, గుంటూరు జిల్లాలో 72 శాతం, చిత్తూరు జిల్లాలో 71 శాతం, ప్రకాశం జిల్లాలో 67 శాతం, హైదరాబాద్ 64 శాతం, నల్గొండ జిల్లాలో 53 శాతం ఉత్తీర్ణత సాధించారు.