అనాథాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన కియా ఇండియా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కియా ఇండియా సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నతంగా వేడుకలను నిర్వహించింది. అంకితభావం కలిగిన కియా ఇండయా మహిళా ఉద్యోగులు రెయిన్బో క్రెసెంట్ అనాథాశ్రమంలో రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అక్కడే ఉంటున్న బాలికలతో సంబంధాలను పెంపొందించడం, ఆనందాన్ని పంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
సంపూర్ణ సామాజిక బాధ్యత, సాధికారత కోసం కియా ఇండియా నిబద్ధతతో ఈ కార్యక్రమం నిర్వహించింది. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

కొన్ని ముఖ్య ముఖ్యాంశాలు:
కియా ఇండియా మహిళా ఉద్యోగులు అనాథాశ్రమంలో బాలికలతో సరదా గడిపేందుకు ఒక రోజు సేవ కోసం కార్పొరేట్ విహారయాత్ర చేశారు.ఇంటరాక్టివ్ గేమ్లు, కార్యకలాపాలు, హృదయపూర్వక సంభాషణలు శాశ్వత సంబంధాలను సృష్టించాయి.ఎలక్ట్రానిక్స్, దుస్తులు, శానిటరీ ఉత్పత్తులు వంటి ముఖ్యమైన వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రామలను బాలికలతో కలిసి ఎంతో ఆనందంగా నిర్వహించారు.కియా ఇండియా "కేర్ ఫర్ పీపుల్" ప్రధాన విలువను, మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో వారి నిబద్ధతను తెలియజేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించామని కియా ఇండియా పీఆర్ఓ తేజస్వి బండారి వెల్లడించారు. మహిళా దినోత్సవ స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా కార్యక్రమం జరిగిందని తెలిపారు.












Click it and Unblock the Notifications