International Yoga Day 2025 live updates: యోగా అనేది కేవలం శరీర వ్యాయమమే కాదు.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఘనమైన కార్యక్రమం. యోగా సంగం 2025 పేరుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోన్న యోగా వేడుకకు భారత్ సిద్ధమైంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారత్లో లక్షకు పైగా వేదికలు, కొన్ని లక్షల మంది ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. చరిత్ర గర్వగా చెప్పుకునేలా శ్వాస, శరీరం, సఖ్యత ఒకే గొడుగు కిందకు రానున్నాయి. "ఒక భూమి.. ఒక ఆరోగ్యం కోసం యోగా" అనేది ఈ ఏడాది యోగా థీమ్గా ఉంది.
ఇక ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యోగాసనాలు వేయనున్నారు.విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి 26 కిలోమీటర్ల పొడవున అంటే భోగాపురం వరకు యోగా కారిడార్ను తయారు చేసింది ఏపీ ప్రభుత్వం.
దాదాపు 3 లక్షల మంది యోగాసనాలు వేస్తారు.వరల్డ్ రికార్డులతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈ వేడుకకు చోటు దక్కనుంది. ఇక 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం.
Jun 21, 2025, 10:19 am IST
విశాఖలో ఈ ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమానికి మూడు లక్షల మంది హాజరయ్యారు. గతంలో సూరత్ లో నిర్వహించిన కార్యక్రమానికి 1,47,952 మంది పాల్గొన్నారు.
Jun 21, 2025, 10:17 am IST
విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు లభించింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావడం ఓ రికార్డు. గతంలో సూరత్ రికార్డును విశాఖ అధిగమించింది.
Jun 21, 2025, 9:47 am IST
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నాతో యోగా చేయించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేనీ స్థాయికి వచ్చాను- మంత్రి నారా లోకేష్
Jun 21, 2025, 9:26 am IST
ఏపీ సచివాలయ ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
Jun 21, 2025, 9:17 am IST
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రోజువారీ జీవితంలో యోగా ఓ భాగం కావాలని ఆకాంక్షించారు.
Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.
ప్రపంచం మొత్తం మీద ఉద్రిక్తత వాతావరణం, అశాంతి, అస్థిరత నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితుల్లో యోగా శాంతి, ఆయురారోగ్యాలను కోరుకుంటూ యోగాను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Jun 21, 2025, 8:15 am IST
చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని అన్నారు.
Jun 21, 2025, 8:15 am IST
యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి, వీటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు.
Jun 21, 2025, 7:53 am IST
`యోగా ఫర్ వన్ ఎర్త్, ఫర్ వన్ హెల్త్` అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
Jun 21, 2025, 7:49 am IST
యోగా ఆధారాల విద్య విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తోన్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్ ఈ విషయంలో ఓ ముందడుగు వేసిందని చెప్పారు.
Jun 21, 2025, 7:29 am IST
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డే పోస్టల్ స్టాంప్ ను ప్రధాని మోదీ, చంద్రబాబు ఆవిష్కరించారు.
Jun 21, 2025, 7:25 am IST
రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని, విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోన్నామని చంద్రబాబు అన్నారు.
Jun 21, 2025, 7:05 am IST
విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. యోగాను విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.
Jun 21, 2025, 6:56 am IST
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. శుక్రవారం నాడు 22,122 మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలను వేశారని, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారని ప్రకటించారు.
Jun 21, 2025, 6:43 am IST
ఆంధ్రప్రదేశ్
ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖపట్నం ఆర్ కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకల వేదిక వద్దకు చేరుకున్నారు.
Jun 21, 2025, 6:18 am IST
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం సందడిగా మారింది. ప్రధాన వేదిక వద్ద వేలాదిమంది యోగాకు సన్నద్ధం అయ్యారు.
Jun 21, 2025, 6:06 am IST
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లఢక్ వద్ద భారత్- చైనా సరిహద్దుల్లోని ప్యంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద 14,200 అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్లు ఆసనాలను వేశారు.
Jun 21, 2025, 5:57 am IST
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద భారత కాన్సులేట్.. యోగా సెషన్ ను నిర్వహించింది. పలువురు విదేశీయులు ఇక్కడ యోగాసనాలను వేశారు.
Jun 21, 2025, 12:28 am IST
ఒడిషా
అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని చేసిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్
అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని చేసిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్
5:57 AM, 21 Jun
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద భారత కాన్సులేట్.. యోగా సెషన్ ను నిర్వహించింది. పలువురు విదేశీయులు ఇక్కడ యోగాసనాలను వేశారు.
6:06 AM, 21 Jun
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లఢక్ వద్ద భారత్- చైనా సరిహద్దుల్లోని ప్యంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద 14,200 అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్లు ఆసనాలను వేశారు.
6:18 AM, 21 Jun
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం సందడిగా మారింది. ప్రధాన వేదిక వద్ద వేలాదిమంది యోగాకు సన్నద్ధం అయ్యారు.
6:43 AM, 21 Jun
ఆంధ్రప్రదేశ్
ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖపట్నం ఆర్ కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకల వేదిక వద్దకు చేరుకున్నారు.
6:56 AM, 21 Jun
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. శుక్రవారం నాడు 22,122 మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలను వేశారని, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారని ప్రకటించారు.
7:05 AM, 21 Jun
విశాఖపట్నం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. యోగాను విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు.
7:25 AM, 21 Jun
రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని, విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోన్నామని చంద్రబాబు అన్నారు.
7:29 AM, 21 Jun
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డే పోస్టల్ స్టాంప్ ను ప్రధాని మోదీ, చంద్రబాబు ఆవిష్కరించారు.
7:49 AM, 21 Jun
యోగా ఆధారాల విద్య విధానాలు, చికిత్సను కూడా ప్రోత్సహిస్తోన్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్ ఈ విషయంలో ఓ ముందడుగు వేసిందని చెప్పారు.
7:53 AM, 21 Jun
`యోగా ఫర్ వన్ ఎర్త్, ఫర్ వన్ హెల్త్` అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
8:15 AM, 21 Jun
యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి, వీటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు.
8:15 AM, 21 Jun
చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం యోగాంధ్రను అద్భుతంగా నిర్వహించిందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుండి నడిపించారని అన్నారు.
8:32 AM, 21 Jun
ప్రపంచం మొత్తం మీద ఉద్రిక్తత వాతావరణం, అశాంతి, అస్థిరత నెలకొందని మోదీ వ్యాఖ్యానించారు. అటువంటి పరిస్థితుల్లో యోగా శాంతి, ఆయురారోగ్యాలను కోరుకుంటూ యోగాను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
9:17 AM, 21 Jun
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రోజువారీ జీవితంలో యోగా ఓ భాగం కావాలని ఆకాంక్షించారు.
Working on both body and spirit, Yoga helps develop strength and tranquility. On this #InternationalYogaDay, let us commit to making this timeless practice a part of our daily lives.
ఏపీ సచివాలయ ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
9:47 AM, 21 Jun
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నాతో యోగా చేయించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేనీ స్థాయికి వచ్చాను- మంత్రి నారా లోకేష్
10:17 AM, 21 Jun
విశాఖ యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు లభించింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావడం ఓ రికార్డు. గతంలో సూరత్ రికార్డును విశాఖ అధిగమించింది.
10:19 AM, 21 Jun
విశాఖలో ఈ ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమానికి మూడు లక్షల మంది హాజరయ్యారు. గతంలో సూరత్ లో నిర్వహించిన కార్యక్రమానికి 1,47,952 మంది పాల్గొన్నారు.