ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు: సీఐడీకి..
IPS officers transfers in Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించింది.
తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది ఏపీ ప్రభుత్వం. వారికి వేర్వేరు విభాగాలు, శాఖాధిపతులుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి.

- రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ నియామితులు అయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
- ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్)గా పని చేస్తోన్న పీ వెంకట రమణ.. అదే విభాగానికి డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు.
- వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారి ఎస్ వీ శ్రీధర్ రావు సీఐడీ పోలీస్ సూపరింటెండెంట్ గా నియమితులు అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఖాళీగా ఉంటోంది.
కొంతకాలంగా కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు.. తమకు కేటాయించిన శాఖలు, విభాగాల పట్ల అసంత్రుప్తితో ఉన్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా సర్వీసుల నుంచే వైదొలిగారు. ఐపీఎస్ సర్వీసులకు రాజీనామా చేశారు. వీఆర్ఎస్ తీసుకున్నారు. తన రాజీనామాకు అసంత్రుప్తి కారణం కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications