ఏపీలో కోడిగుడ్ల ధరలు పతనం..ఇరాన్- ఇజ్రాయెల్ వార్ తో సంబంధం!
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తెలుగు రాష్ట్రాలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోని పౌల్ట్రీ పరిశ్రమపైన, అందులోన ఏపీ, తెలంగాణలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోడిగుడ్ల ఎగుమతి జరుగుతుంది.
ఏపీలో దేశంలోనే అధికంగా కోడిగుడ్ల ఉత్పత్తి
ప్రస్తుతం యుద్ధం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమ పైన పెనుభారం పడుతోంది. ఫలితంగా కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా, ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా గా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి దేశంలోని కోడిగుడ్ల ఉత్పత్తిలో గణనీయంగా ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది.

గల్ఫ్ దేశాలకు ఏపీ, తెలంగాణా నుండి కోడిగుడ్ల ఉత్పత్తి
దాదాపు భారతదేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలు ఉత్పత్తి చేసే కోడిగుడ్లలో 18 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి జరుగుతుంది. అంటే రోజుకు దాదాపు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు కేంద్రంగా విస్తరించి ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్ కు ఇక్కడి నుండి కోడిగుడ్లను అందిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతి జరుగుతుంది.
గల్ఫ్ దేశాలకు నిలిచిన నౌకలు.. నో ఎగ్స్ ఎక్స్ పోర్ట్
అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణం లో గల్ఫ్ దేశాలకు నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో ఎగుమతి కావలసిన కోడిగుడ్లు ఇక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల ధర బాగా పడిపోయింది. ఇక ఎగుమతి చేయాల్సిన గుడ్లను నిల్వ చేయడం కూడా వీలుకాని పరిస్థితులలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కోడిగుడ్ల ధరలు తగ్గుదల.. పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టం
ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్ల హోల్సేల్ ధరను 4.25 పైసలు గా నిర్ణయించగా ప్రస్తుతం బయట చిల్లర వర్తకుల వద్ద ఒక్కొక్క కోడి గుడ్డు ధర 5 రూపాయలు పలుకుతుంది. కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడం పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది.
సామాన్యులకు ధరలు తగ్గటం సంతోషం
కోళ్ళ మేతల ధరలు విపరీతంగా పెరిగి, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగి ఇబ్బంది పడుతున్న పౌల్ట్రీ రైతులు, ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా సంక్షోభంతో మరింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఏదిఏమైనా కోడిగుడ్ల ధరలు తగ్గడం పౌల్ట్రీ నిర్వాహకులకు ఆవేదన కలిగిస్తుంటే, సామాన్య ప్రజానీకం మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
బయటపడ్డ రహస్య ప్రపంచం, 7 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ గుడ్లు! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications