ఢిల్లీ టూర్ ఏ వార్తను మోసుకొస్తుందో : చంద్రబాబు ప్రయత్నాలు సఫలమయ్యేనా
విదేశీ యాత్రలు ముగించుకుని రాష్ట్రంలో ల్యాండయిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీ ద్వారానైనా ప్రత్యేక హోదాపై కేంద్రం మనసు మార్చాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చంద్రబాబు. ఇందుకోసం ఆయన ప్రధాని మోడీకి ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
కాగా.. చంద్రబాబుకు ప్రస్తుతం మోడీ వద్ద లభించిన అపాయింట్ మెంట్ రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై సమీక్షించడానికి మాత్రమే. దీంతో చంద్రబాబు స్పెషల్ స్టేటస్ ప్రజెంటేషన్ కి మోడీ అదనపు సమయం కేటాయించగలరా అన్నది అనుమానంగా మారింది. మరోవైపు చంద్రబాబు మాత్రం విషయాన్ని ఎలాగైనా మోడీ దగ్గర ప్రస్తావించాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సమయం కేటాయించినా.. ప్రత్యేక హోదాపై పాత పాటే పాడుతారా, లేకపోతే ఆర్థిక కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి ఏమైనా ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. చూడాలి మరి చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీకి ఎలాంటి వార్తలను మోసుకొస్తుందో..!
ఇదిలా ఉంటే, కరువు పరిస్థితులను నివారించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్న తరుణంలో కరువు నివారణ చర్యల కింద కేంద్రం నుంచి చంద్రబాబు ఎంత సహాయాన్ని తీసుకొస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications