కొండవీడు కోటకు సమీపంలో 150 కోట్లతో స్వర్ణ దేవాలయం
గుంటూరు: రూ. 150 కోట్లతో గుంటూరు జిల్లాలోని కొండవీడు ప్రాంతంలో శ్రీకృష్ణునికి బంగారు ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ నిర్ణయించింది. ఈ దేవాలయానికి దసరా రోజున శంకుస్థాపన చేయాలని ముహుర్తం నిర్ణయించినట్లు ఇస్కాన్ తెలిపింది.
ఈ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే అవకాశం ఉందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతాన్ని ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే వెన్నముద్దల చిన్న కృష్ణుడు ఇక్కడ కొలువదీరనున్నాడు.
జిల్లాలోని యడ్లపాడు మండలం చెంఘీజ్ ఖాన్పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలోనే అతి అరుదైనదని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించిందని వెల్లడించారు.

అంతేకాదు ఈ ప్రాంతంలో ఇస్కాన్ గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ బంగారు దేవాలయం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయన్నారు.
వీటితో పాటు వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీనశాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications