కోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ అశోక్: ముందస్తు బెయిల్ కోసం అభ్యర్ధన: ఇంతకీ ఎక్కడున్నారు..!
ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఏపీ పౌరుల సమాచారం..ఆధార్..ఓటరు కార్డు..ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారం ఐటీ గ్రిడ్స్ ద్వారా టీడీపీ సేవామిత్ర యాప్కు అనుసంధానం చేసారు. దీంతో..కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు చేసినా..ఇప్పటి వరకు ఆశోక్ను పట్టుకోలేదు. ఇదే సమయంలో అశోక్ మందుస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు,
ఐటీ గ్రిడ్స్ అశోక్ ఎక్కడ...
ఏపీ-తెలంగాణలో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐటీ గ్రిడ్స్ అశోక్ ఇప్పటికీ పోలసులకు దొరకలేదు.డేటా చోరీ వ్యవహారం పైన లోకేశ్వర్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ సాగిస్తున్న సిట్ అశోక్ కోసం గాలింపు కొనసాగిస్తోంది. అశోక్ ఏపీ రాజధానిలోనే ఉన్నారని..ఆయనకు టీడీపీ ముఖ్యులు ఆశ్రయం ఇస్తున్నారని రాజకీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, రెండు ప్రభుత్వాలు వేసిన సిట్లు ఇంత వరకు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఈ వ్యవహారం పైన వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం కలిసి ఫిర్యాదు చేసింది. ఇది వివాదం కొనసాగుతుండగానే టీడీపీ సేవామత్ర యాప్ను తొలిగించారు. ఎన్నికల వేళ ఇది రాజకీయాంగానూ సంచలనంగా మారింది. అయితే, ఇదే కేసులో విశాఖలోని బ్లూ ఫ్రాగ్ సంస్థ పైనా ఆరోపణలు వచ్చాయి.

ముందస్తు బెయిల్ కోసం..
ఇక వైపు అశోక్ కోసం గాలింపు కొనసాగుతుండగానే...ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ కేసు నుండి బయట పడాలనే ఉద్దేశంతో అశోక్ పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. అశోక్తో పాటుగా సహ నిందులుగా ఉన్న భార్య శ్రీలక్ష్మి అనుచరులు షేక్ అబ్దుల్ ఉజైన్, కమలాకర్ విడివిడిగా రంగారెడ్డి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటరు దాఖలు చేసారు. సుదీర్ఘ వాదనల తరువాత ఉత్తర్వుల కోసం కేసును ఈ నెల 23వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేసారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications