Nara Lokesh: సత్య నాదెళ్లతో నారా లోకేష్.. ఏపీకి భారీగా పెట్టుబడులు..!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈఓలు, అధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కలిశారు. ఏపీలో ఉన్న అవకాశాలపై సత్య నాదెళ్లకు లోకేష్ వివరించారు. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ కు టెక్నికల్ సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర రాజధానికి ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రావాలని సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.
లోకేష్ చెప్పినవన్నీ నోట్ చేసుకున్న సత్య నాదెళ్ల.. తమ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో కీలకు పని చేస్తుందని అన్నారు. ఈ రంగల్లో తమ కంపెనీ ప్రపంచ కంపెనీగా ఉందని.. సాఫ్ట్ వేర్ తో పాటు వివిధ రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని వివరించారు. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కంపెనీ 2023లో 211.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లుగా గుర్తు చేశారు.

దీని స్పందనగా.. ఏపీను ఐటీ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ హబ్ లు, ఎన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. క్లౌడ్ సేవల్ల మైక్రోసాఫ్ట్ సహకారం చాలా అవసరమన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ తో విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు గుర్తు చేశారు.
Had an insightful meeting with @satyanadella, CEO of @Microsoft. Sought his valuable guidance and support in advancing IT, AI, and skill development in Andhra Pradesh. Looking forward to collaborative efforts to drive digital transformation and opportunities in the state.… pic.twitter.com/8fmHhIGtIN
— Lokesh Nara (@naralokesh) October 29, 2024
అంతకు ముందు నారా లోకేష్ టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనంతపురం అనుకూలంగా ఉంటుందని వివరించారు.అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని పేర్కొన్నారు. ఆ తర్వాత డల్లాస్లో పెరోట్ గ్రూప్ ఛైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ను లోకేష్ కలిశారు. మరికొంత మంది కంపెనీల సీఈఓలను లోకేష్ కలిసే అవకాశం ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications