జగన్ కేబినెట్ భేటీ-సాధారణ, వ్యవసాయ బడ్జెట్ లకు ఆమోదముద్ర-బుగ్గన కామెంట్స్..
ఏపీలో ఇవాళ రాష్ట్ర సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తరఫున వరుసగా నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సాధారణ బడ్డెట్ తో పాటు వ్యవసాయ బడ్డెట్ లకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బడ్దెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్ధికమంత్రి బుగ్గన బడ్డెట్ ఎలా ఉంటుందో చెప్పేశారు.
రాష్ట్ర అసెంబ్లీలో బడ్డెట్ ప్రవేశపెట్టాల్సిన తరుణంలో ఇవాళ ఉదయం సీఎం జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రెండు బడ్డెట్ లకు ఆమోదముద్ర వేసింది. ఇందులో రాష్ట్ర సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బడ్డెట్ ప్రతులకు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు అధికారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో 2023-24 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైనట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications