'జగన్కు జైలు భయం పట్టుకుంది, అందుకే అలా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, ఆయనకు జైలు భయం పట్టుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం అన్నరు.
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తానేమో అనే భయం జగన్కు పట్టుకుందని చెప్పారు. ఈ కారణంగానే జగన్ నిత్యం వణికిపోతున్నారని చెప్పారు. నిలకడ లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేసే అర్హత జగన్కు లేదన్నారు.
కొడాలి నానిపై వర్ల ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పైన టీడీపీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడలో దేవాలయాలకు చెందిన మూడు వందల ఎకరాల భూములను కొడాలి నాని కాజేశారని ఆరోపించారు. తన పేరుతో పాటు తన సోదరుల పేర్ల పేరిట ఆలయ భూములను రాయించుకున్నారని ఆరోపించారు.