ఏపీలో ఇసుక తవ్వకాలపై జగన్ సర్కార్ క్లారిటీ-సుప్రీం తీర్పు ప్రభావం ఎక్కడంటే..?
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల్ని నిషేధిస్తూ గతంలో ఎన్టీటీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిన్న సమర్ధించింది. దీంతో ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోతాయనే ప్రచారం సాగుతోంది. దీనిపై గనులశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రభావం ఎంత వరకూ పరిమితం అన్న దానిపై గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశంతో పాటు ఏపీ ప్రభుత్వ విధానం కూడా స్పష్టంచేశారు.
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై ఎటువంటి నిషేధం లేదని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి ఇవాళ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని అరణీయార్ నదీపరీవాహక ప్రాంతాల్లో బి-2 (సెమీ మెకనైజ్డ్) కేటగిరిలో 18 ఒపెన్ ఇసుక రీచ్ లకు ఇచ్చిన అనుమతులను సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేశామన్నారు. ఈ రీచ్ లకు సంబంధించి తాజాగా మళ్ళీ అన్ని పర్యావరణ అనుమతులను సదరు సంస్థ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాతే ఈ 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చన్నారు.

అలాగే పర్యావరణంకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ ఈ 18 రీచ్ లపై ఎన్జీటి విధించిన జరిమానాకు సుప్రీంకోర్ట్ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బి1, బి2 కేటగిరిల్లో ఇప్పటికే జారీ చేసిన పర్యావరణ అనుమతులను కూడా పర్యావరణశాఖ పునఃసమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు సూచించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన ఇసుక పాలసీని అమలు చేస్తోందని, దీనిలో భాగంగా పర్యావరణానికి ఎక్కడా విఘాతం కలగకుండా అన్ని అనుమతులు ఉన్న రీచ్ ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
చిత్తూరు జిల్లాలోని 18 ఇసుక రీచ్ లకు సంబంధించి ఎన్జీటిలో దాఖలైన కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వాటిల్లో తవ్వకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని గనులశాఖ ఆదేశించిందని తెలిపారు. రాష్ట్రంలో వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడకుండా, భవన నిర్మాణరంగానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం మేరకు అన్నిచోట్ల ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వర్షాల వల్ల నదులు, జలాశయాల్లో ఇసుక తవ్వకాలకు విఘాతం ఏర్పడుతుందని, దీనివల్ల నిర్మాణపనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలోనే ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications