అబ్దుల్ కలాం స్ఫూర్తి చిరస్మరణీయం : జగన్
హైదరాబాద్ : శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నేడు. ఈ సందర్బంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలాంకు ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
నేటి ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. కలాంను స్మరించుకున్నారు. కలాం నిరంతర స్పూర్తిని అందించే వ్యక్తిగా చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని చెప్పారు. కాగా, కలాం జన్మదినాన్ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే అక్టోబర్ 15,1931లో తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు కలాం. 2015 జూలై 15న షిల్లాంగ్ లోని ఐఐఎంలో ఓ సెమినార్ లో పాల్గొన్న కలాం.. అక్కడ ప్రసంగిస్తున్న సందర్బంలోనే కుప్పకూలిపోయారు. అనంతరం బెధాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కలాం.












Click it and Unblock the Notifications