మెదక్ డిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి: మెదక్ అభ్యర్థి?

మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, జగ్గారెడ్డి టికెట్ దక్కించుకుని, తెరాసను ఢీకొనడానికి సిద్ధపడుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, తెలంగాణలో మరో రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు సంబంధించి మూడు జిల్లాలు మెదక్, రంగారెడ్డి, అదిలాబాద్లకు సంబంధించి డిసిసి అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఆదేశాలు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడిగా కె. మల్లేష్, అదిలాబాద్ జిల్లా డిసిసి దేశ్పాండే నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరి జనార్థన్ ద్వివేది గురువారం ప్రకటన విడుదల చేశారు. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచన మేరకే ఆ ముగ్గురి నియామకం జరిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications