వైసీపీ మాట్లాడినా- టీడీపీ నోరెత్తలేదు.. బయటపెట్టిన జైరాం రమేష్..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీకి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు కూడా దీనికి హాజరయ్యారు. ఇందులో పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీల వారీగా ప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పారు. అయితే ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా చర్చించారు.
ఇవాళ జరిగిన అఖిలపక్ష భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ, బీహార్ కు ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ ప్రతినిధులు కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఏపీతో పాటు కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా గురించి అడగలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. డిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా అడుగుతున్నట్లు చెప్పుకుంటూ కీలకమైన అఖిలపక్ష భేటీలో టీడీపీ మాట్లాడకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం టీడీపీకి ఇదే ప్రశ్న వేసారు. ఇవాళ అఖిలపక్ష భేటీకి వైసీపీ ప్రతినిధిగా హాజరైన సాయిరెడ్డి.. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. కానీ.. టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు కనిపిస్తోందని భేటీ అనంతరం వెల్లడించారు. తాము మాత్రం రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు.
In today's all-party meeting of floor leaders chaired by Defence Minister Rajnath Singh, the JD(U) leader demanded special category status of Bihar. The YSRCP leader demanded special category status for Andhra Pradesh. Strangely, the TDP leader kept quiet on the matter.
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 21, 2024
మరోవైపు అఖిలపక్ష భేటీ తర్వాత మాట్లాడిిన టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు సైతం తాము అమరావతి రాజధాని, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు సహా పలు రాష్ట్ర ప్రాజెక్టులపై మాట్లాడినట్లు వెల్లడించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటు చేసుకున్న విధ్వంసం, ఆర్ధిక ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎంపీ కూడా ఎక్కడా చెప్పలేదు. దీంతో టీడీపీ అఖిలపక్ష భేటీలో హోదాపై ఎందుకు మాట్లాడలేదన్న చర్చ జరుగుతోంది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications