ఫ్యాన్స్తో భేటీ: మౌనం వీడనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: విశాఖపట్నం సభ తర్వాత మౌనంగా ఉంటూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వీడే అవకాశాలున్నాయి. ఆయన మూడో సభను ఎక్కడ పెడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన బిజెపికి ప్రచారం చేయడానికి సన్నద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తన అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానుల అభిప్రాయాలను తీసుకుని ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలోనూ, సమీంధ్రాలోనూ బీజీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ''కాంగ్రెస్ హటావో దేశ్ బచావో'' నినాదాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పూర్తి మద్దతు ప్రకటించిన వియషం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ తొలుత కర్నాటకలో తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో బిజెపి - టిడిపి కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ ఆవిర్భావ సభలోనూ, విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలోనూ నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను బిజెపి పార్టీ ప్రచారానికి వాడుకోవడానికి రంగం సిద్ధంచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి బిజెపి తరపున కర్ణాటకలో వవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పవన్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. రోడ్షోలు, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలుస్తోంది.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications