జగదీశ్వర్ చెల్లని రూపాయి, పార్టీ నుండి వెళ్తారు.. వస్తారు: జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ చెల్లని రూపాయి అని, ఆయన కుసంస్కారి అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత జానా రెడ్డి సోమవారం మండిపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి గురించి తాను మాట్లాడటం తన స్థాయికి తగింది కాదన్నారు. అవినీతికి పాల్పడిన జగదీశ్వర్ రెడ్డి పైన చర్యలకు పట్టుబడతామన్నారు. జగదీశ్వర్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తనను కలిసిన అంశంపై మాట్లాడుతూ.. సస్పెన్షన్ ఎత్తి వేయించాలని వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల పైన కూడా జానా స్పందించారు.

చిన్నపరెడ్డి తెరాసలో చేరుతున్నారనేది అప్రదాన్యత అంశమని చెప్పారు. పార్టీ నుండి రోజుకు ఒకరు వెళ్తుంటారు.. మరొకరు వస్తుంటారని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం ఎవరెవరో ఎక్కడెక్కడో చేరుతుంటారని చెప్పారు. అలాంటి వాటి గురించి మాట్లాడటం సరికాదన్నారు.
అన్ని వర్గాల ఆశలను తెరాస నీరుగార్చింది: డీఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అన్ని వర్గాల వారి ఆశలను నీరుగార్చిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఆ పార్టీ మండలి నేత డీ శ్రీనివాస్ విమర్శించారు. హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ మాటలు మాత్రమే చెబుతున్నారని, ఆచరణలో ఏమీ లేదన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని గతంలో చెప్పారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త ఉద్యోగాలంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతున్నారన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications