చంద్రబాబు ములాఖత్ వేళ..ప్రధాని ఓదార్పు ఫొటోలు: పవన్ పరోక్ష సందేశం

అమరావతి: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఫ్లాష్ మీటింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ రాజధానికి వెళ్లిన చంద్రబాబు- ప్రధానిని కలిశారు. కొన్ని నిమిషాల పాటు ఆయనతో మాట్లాడారు. వారిద్దరి మధ్య సాగిన ఈ మాటా-ముచ్చట అనేది.. మళ్లీ బీజేపీ-టీడీపీ మధ్య పాత స్నేహాన్ని చిగురింపజేయొచ్చనే అభిప్రాయాలకు తెర తీసింది.

పొత్తు కొలిక్కి..

బీజేపీతో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలంగా సాగిస్తోన్న పొత్తు ప్రయత్నాలను ఓ కొలిక్కి తీసుకుని రావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదివరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామ్య పార్టీ. రాష్ట్రానికి సంజీవినిగా చెప్పుకొనే ప్రత్యేక హోదాను సైతం కాదని అప్పట్లో ప్రధాని మోడీ ప్రతిపాదించిన ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను తాము నిర్మిస్తామంటూ రాష్ట్రానికి బదలాయించుకున్నారాయన అప్పట్లో.

ఎన్డీఏకు గుడ్‌బై..

ఎన్డీఏకు గుడ్‌బై..

ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. ఆయన పార్టీకి చెందిన ఎంపీలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నల్ల చొక్కాలను ధరించి మరీ చంద్రబాబు.. ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. ఢిల్లీ వేదికగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఎన్డీఏను ఢీ కొట్టడానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న యూపీఏ భాగస్వామ్య పక్షాలతోనూ సన్నిహితంగా మెలిగారు.

ప్రతిపక్షాలతో జట్టు..

ప్రతిపక్షాలతో జట్టు..

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థుల ఎన్నికల తరఫున ఎన్నికల ప్రచారం సైతం చేశారు. 2019 నాటి ఎన్నికల్లో ఎన్డీఏ ఖచ్చితంగా ఓడిపోతుందనే అంచనాలకు రావడం వల్లే చంద్రబాబు- బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారనేది బహిరంగ రహస్యమే.

అంచనాలు తారుమారు..

ఎన్నికల తరువాత ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఏపీలో ఆయన ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ మరోసారి కేంద్రంలో జెండా పాతింది. ఈ పరిణామాల మధ్య మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. జాతీయ స్థాయి మిత్రపక్షాలకు పూర్తిగా దూరం అయ్యారు. మమత బెనర్జీతో గానీ, అరవింద్ కేజ్రీవాల్‌తో గానీ కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.

పవన్ కల్యాణ్ ట్వీట్లు..

పవన్ కల్యాణ్ ట్వీట్లు..


ఈ పరిణామాల మధ్య ఆయన హస్తినలో ప్రధాని మోడీని కొన్ని నిమిషాల పాటయినా కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ-టీడీపీ మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు చిగురిస్తాయనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో 2014 నాటి ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీకి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశమౌతున్నాయి.

పాత ఫొటోలు..

పాత ఫొటోలు..

మిషన్ చంద్రయాన్ విఫలమైన అనంతరం అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్‌ను ఓదార్చుతూ ప్రధాని మోడీ అక్కున చేర్చుకున్న ఫొటోలు, బర్మింగ్‌హామ్ వేదికగా కొనసాగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో పసిడి పతకాన్ని కోల్పోయి కన్నీటి పర్యంతమైన భాతర అథ్లెట్లను ఓదార్చుతూ చేసిన ట్వీట్లను పవన్ కల్యాణ్ తాజాగా పోస్ట్ చేశారు. పరాజయంలో ఓదార్పే ఊపిరి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మోడీని చంద్రబాబు కలిసిన రెండో రోజే- పవన్ కల్యాణ్ ఈ ఓదార్పు ఫొటోలను తెరమీదికి తీసుకుని రావడం అనేక రకాల చర్చలకు దారి తీసినట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+